ఓటీఎస్ కట్టమని వస్తే తరిమి కొట్టండి: బండారు సత్యనారాయణమూర్తి
ABN , First Publish Date - 2021-12-27T21:32:12+05:30 IST
టీఎస్ కట్టమని వలంటీర్లు వస్తే తరిమి తరిమి కొట్టండని ప్రజలకు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.
విశాఖపట్నం: ఓటీఎస్ కట్టమని వలంటీర్లు వస్తే తరిమి తరిమి కొట్టండని ప్రజలకు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వన్ టైం సెటిల్ మెంట్ కింద డబ్బులు కట్టమనడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఎవరూ డబ్బులు కట్టవద్దని సూచించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయికే హక్కుదారులకు పట్టాలు ఇస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వమే సినిమా టికెట్లు, మాంసం.. అమ్మడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి పాలన గాలికి వదిలి బ్రోకర్ పనులు చేస్తున్నారని బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు.