విశాఖ ప్రమాదంపై మాజీ మంత్రి బండారు స్పందన
ABN , First Publish Date - 2020-07-14T12:49:01+05:30 IST
విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంతో మరోసారి
విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంతో మరోసారి అధికారులు నిర్లక్ష్యం బయటపడిందని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. మొన్న ఎల్జీ పాలిమార్స్, నిన్న సాయినార్, నేడు విశాఖ సాల్వెంట్స్లో ప్రమాదాలే దీనికి సాక్ష్యమన్నారు. రాత్రి ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో బండారు మాట్లాడారు. ‘ ఈ భారీ ప్రమాదం వల్ల హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. దీంతో మరింత ప్రమాదం ఉందని మా వాళ్లు చెబుతున్నారు. ప్రమాదంలో ఒకరికి 80 శాతం శరీరం కాలిపోయిందని తెలుస్తోంది. విశాఖపై ప్రేమంటే ఇదేనా సీఎం జగన్ రెడ్డి..?. తక్షణమే ప్రమాదానికి కారకులెవరో వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.