ఎన్నికల వేళ విశాఖ గుర్తొచ్చిందా విజయసాయి?

ABN , First Publish Date - 2021-03-04T07:04:56+05:30 IST

ఎన్నికల వేళ విశాఖపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా విశాఖ అభివృ ద్ధిపై దృష్టిసారించారా అని టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు.

ఎన్నికల వేళ విశాఖ గుర్తొచ్చిందా విజయసాయి?
సమావేశంలో మాట్లాడుతున్న బండారు సత్యనారాయణమూర్తి

టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి

కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఏనాడైనా మాట్లాడారా

ఇప్పుడు ఓట్ల కోసం ఎందుకీ జిమ్మిక్కులు

మహారాణిపేట, మార్చి 3: ఎన్నికల వేళ విశాఖపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఏనాడైనా విశాఖ అభివృ ద్ధిపై దృష్టిసారించారా అని టీడీపీ సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. స్మార్ట్‌ సిటీ, మెట్రో అంశాలపై ఏనాడైనా పార్లమెంటులో ప్రస్తావించారేమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కార్యాల యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఎన్నికల ప్రచారంలో తన స్థాయిని మరిచి విజయ సాయిరెడ్డి ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తు న్నారని, ముందు విశాఖకు ఆయన ఏం చేశా రో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పెట్రో యూనివర్సిటీ, ఐదు లక్షల ఐటీ ఉద్యో గాలు, లులూ కాంప్లెక్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, రైల్వే జోన్‌ తదితర దాదాపు 17 అంశాలపై ఆయన విశాఖ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.


స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమీ చేయ కుండా ఏముఖం పెట్టుకుని కార్పొరేషన్‌ ఎన్ని కల్లో ప్రజల ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రకటనలు, దౌర్జన్యంతో రాజకీయం చేస్తున్నారన్నారు.  ఎమ్మెల్సీ  దువ్వారపు రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T07:04:56+05:30 IST