‘తెలుగుకు జాతీయ గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్’
ABN , First Publish Date - 2022-01-09T11:31:40+05:30 IST
‘తెలుగు జాతికి, తెలుగు భాషకు’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది
హైదరాబాద్ సిటీ/భీమవరం : ‘తెలుగు జాతికి, తెలుగు భాషకు’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని హరియాణా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో చివరిరోజు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు భాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలిసేలా సభలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలుగు భాషలో జీవన మూలాలు ఉంటాయని, వాటిని కాపాడుకోవడమంటే బతుకు కోరుకోవడమన్నారు. కార్యక్రమానికి గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉండి ఎమ్మెల్యే రామరాజు పాల్గొన్నారు.