ఏ వివరాలు లేకుండా ఫేక్‌గా డీజీపీ మాట్లాడవచ్చా: బండారు

ABN , First Publish Date - 2021-01-16T20:02:44+05:30 IST

విశాఖ: విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని అని చెప్పి.. ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ చెబుతున్నారని

ఏ వివరాలు లేకుండా ఫేక్‌గా డీజీపీ మాట్లాడవచ్చా: బండారు

విశాఖ: విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని అని చెప్పి.. ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ చెబుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీకి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వివరాలు లేకుండా ఫేక్‌గా డీజీపీ మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ‘నువ్వు ఒక సినిమా డీజీపీవి. తాడేపల్లిలో జగన్, సజ్జల ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడమే నీ పని. నీ టోపీపై ఉన్నవి మూడు సింహాలు కాదు.. మూడు పిల్లులు’ అని బండారు సత్యనారాయణ విమర్శించారు. 

Updated Date - 2021-01-16T20:02:44+05:30 IST