14 వరకు మద్యం బంద్‌

ABN , First Publish Date - 2020-03-29T11:26:34+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలను బంద్‌ చేస్తూ కలెక్టర్‌ శేషగిరిబాబు శనివారం ఉత్తర్వులు

14 వరకు మద్యం బంద్‌

నెల్లూరు (క్రైం), మార్చి 28 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలను బంద్‌ చేస్తూ కలెక్టర్‌  శేషగిరిబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో (జనతా కర్ఫ్యూ సందర్భంగా) ఈ నెల 22న తొలి సారిగా జిల్లాలోని 280 దుకాణాలు, 46 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, టూరిజం హోటళ్లు, మిలటరీ క్యాంటీన్లు మూత పడ్డాయి. అదేరోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యం దుకాణాలను మూసి వేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.


తాజాగా మూసివేతను ఏప్రిల్‌ 14వతేదీ వరకు పొడిగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వీ రాధయ్య సిబ్బందితో సమావేశమై అనధికార విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి మద్యం జిల్లాకు రాకుండా చూడాలని సూచించారు. 

Updated Date - 2020-03-29T11:26:34+05:30 IST