అరటి తోట దగ్ధం : రూ.5 లక్షలు నష్టం
ABN , First Publish Date - 2021-03-03T04:36:22+05:30 IST
గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అరటి తోటకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి రైతుకు దాదాపు 5 లక్షలు నష్టం వాటిల్లింది.
మైదుకూరు రూరల్, మార్చి 2 : గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అరటి తోటకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి రైతుకు దాదాపు 5 లక్షలు నష్టం వాటిల్లింది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలో పోతురాజు పెద్ద వెంకటయ్య అనే రైతు రెండు ఎకరాల్లో అరటి పంటను సాగు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్ పైపులతో పాటు పంట పూర్తిగా దగ్ధమైందని, దాదాపు 5 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకవచ్చారు.