నేటి నుంచి అరటి పండ్ల మార్కెటింగ్
ABN , First Publish Date - 2020-04-03T12:00:05+05:30 IST
నేటి నుంచి అరటి పండ్ల మార్కెటింగ్
అమరావతి(ఆంథ్రజ్యోతి): కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలు చేయడంతో ఉద్యాన పంటల కోతలు, రవాణా, ఎగుమతులు నిలిచిపోవడంతో వివిధ రకాల పండ్ల మార్కెటింగ్పై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇప్పటికే కోతకొచ్చి తోటల్లోనే వృథాగా పడిపోతున్న అరటి పండ్లను రాష్ట్రంలో స్థానిక మార్కెట్లకు, అవకాశం మేరకు ఇతర రాష్ట్రాలకు తరలించాలని మార్కెటింగ్శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.