రసాయనాల్లో ముంచిన 15 టన్నుల అరటి గెలల స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-28T13:34:13+05:30 IST
స్థానిక కోయంబేడు మార్కెట్లో బుధవారం ఉదయం కార్పొరేషన్ ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి రసాయనాలు కలిపిన 15 టన్నుల అరటి గెలలు, సపోటా, బొప్పాయి పంఢ్లను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై(Chennai): స్థానిక కోయంబేడు మార్కెట్లో బుధవారం ఉదయం కార్పొరేషన్ ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి రసాయనాలు కలిపిన 15 టన్నుల అరటి గెలలు, సపోటా, బొప్పాయి పంఢ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మార్కెట్లోని వంద దుకాణాల్లో తనిఖీలు జరిపారు. నాసిరకం పండ్లను, రసాయనాలు కలిపిన అరటి పండ్లను వ్యాన్లలో తరలించారు. రసాయనాలు కలిపిన పండ్లను విక్రయించిన వ్యాపారులకు అధికారులు నోటీసులిచ్చారు.