అరటితోటలను పరిశీలించిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-11-29T05:09:17+05:30 IST

భారీ వరద నీటి వల్ల గేట్లు పనిచేయక ప్రాజెక్టులోని నీరం తా ఖాళీ కావడంతో ఆ ప్రాజెక్టును శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టును పరిశీలించారు.

అరటితోటలను పరిశీలించిన బీజేపీ నేతలు
:రాజంపేట మండలంలో దెబ్బతిన్న అరటితోటలను పరిశీలిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు

రాజంపేట టౌన్‌, నవంబరు28 : భారీ వరద నీటి వల్ల గేట్లు పనిచేయక ప్రాజెక్టులోని నీరం తా ఖాళీ కావడంతో ఆ ప్రాజెక్టును శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, అసెంబ్లీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు ఆధ్వర్యంలో ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు తెగిపోయి నీరు లేకుండా కారకులైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పండ్లతోటలకు వెంటనే ప్రభుత్వసహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు ఎ.విజయేంద్రబాబు, సురే్‌షరాజు, పట్టుపోగుల ఆదినారాయణ, గుణవర్మ, వెంకటసుబ్బయ్యనాయుడు, పాపయ్య, శ్రీనివాసులు, రవిశంకర్‌, లోకేష్‌, కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:09:17+05:30 IST