అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం మరో నెల పొడిగింపు

ABN , First Publish Date - 2021-07-30T23:45:46+05:30 IST

కరోనా నేపధ్యంలో పరిస్థతుల దృష్ట్యా... అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం మరో నెల పొడిగింపు

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో పరిస్థతుల దృష్ట్యా... అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. జూలై 31 తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ీడీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్‌ మిషన్‌ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఆయా దేశాలతో జరిగిన ద్వైపాక్షిక ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయన్నారు. యూఎస్‌, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారత్‌కు ఎయిర్‌ బబుల్‌ ఒప్పందముంది. అలాగే కొన్ని కార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించబోదని డీజీసీఏ వెల్లడించింది.

Updated Date - 2021-07-30T23:45:46+05:30 IST