ఈ నెల 15 వరకు డ్రోన్స్‌పై నిషేధం

ABN , First Publish Date - 2022-02-05T03:00:51+05:30 IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు

ఈ నెల 15 వరకు డ్రోన్స్‌పై నిషేధం

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ తెలిపారు. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్‌పై నిషేధం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శనివారం అనగా 5వ తేదీ ఉదయం 6గంటల నుంచి 15వ తేదీ వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పారాగ్లిడర్స్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌పై నిషేధం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 15 వరకు వీవీఐపీ రాక సందర్భంగా నిషేధిస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-02-05T03:00:51+05:30 IST