ఫుడ్ డెలివరీ బైకులను నిషేధించబోయి వెనక్కు తగ్గిన యూఏఈ

ABN , First Publish Date - 2021-10-05T01:16:50+05:30 IST

ఫుడ్ డెలివరీకి వినియోగించే ద్విచక్రవాహనాలను మెయిన్ రోడ్లు, రింగ్ రోడ్లలో నిషేధించాలనుకున్న కువైత్ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది.

ఫుడ్ డెలివరీ బైకులను నిషేధించబోయి వెనక్కు తగ్గిన యూఏఈ

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీకి వినియోగించే ద్విచక్రవాహనాలను మెయిన్ రోడ్లు, రింగ్ రోడ్లలో నిషేధించాలనుకున్న కువైత్ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. వాస్తవా ఫుడ్ డెలివరీకి వినియోగించే ద్విచక్రవాహనాలను మెయిన్ రోడ్లు, రింగ్ రోడ్లలో నిషేధించాలనుకున్న కువైత్ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ ఆదివారం నుంచే నిషేధం అమలు కావాల్సి ఉండగా.. నవంబర్ 7 వరకూ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అక్కడి రెస్టారెంట్లు, డెలివరీ సంస్థల యాజమాన్యాలతో చర్చించిన అనంతరం కువైత్ అంతర్గత వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇకపై డెలివరీ బైకుల్లో ఆయా సంస్థలు తప్పనిసరిగా ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. తాము ప్రయాణించాల్సిన దారి గురించి రైడర్లకు ముందుగానే నోటిఫికేషన్లు అందాలి. తనకు కేటాయించిన దారిని కాదని మరో మార్గంలో రైడర్ ప్రయాణిస్తే వెంటనే సంబంధిత రెస్టారెంట్‌కు, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు నోటీసులు వెళుతుంది. ఈ క్రమంలో రైడర్లకు నోటీసులు జారీ అవుతాయి. పదే పదే తప్పు చేసే వారిని స్వదేశానికి పంపించే అవకాశం కూడా ఉంది. రెస్టారెంట్లు, డెలివరీ కంపెనీలు ఈ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించరాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. 

Updated Date - 2021-10-05T01:16:50+05:30 IST