బ్యాలెట్ పేపర్తో వైసీపీ నేత సెల్ఫీ
ABN , First Publish Date - 2021-04-08T22:02:16+05:30 IST
గుర్రంకొండలో బ్యాలెట్ పేపర్తో వైసీపీ నేత సెల్ఫీ దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
చిత్తూరు: గుర్రంకొండలో బ్యాలెట్ పేపర్తో వైసీపీ నేత సెల్ఫీ దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులో బ్యాలెట్ పేపర్లు హల్చల్ చేస్తున్నాయి. జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. తవణంపల్లి మండలం మాధవరం, సరకల్లు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ రిగ్గింగ్కు పాల్పడిందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు తలుపులు మూసివేసి రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.