Ballariలో రెండోరోజూ ఆందోళన
ABN , First Publish Date - 2022-02-18T18:06:28+05:30 IST
బళ్లారిలో హిజాబ్ సెగలు మరోరోజు చెలరేగాయి. నగరంలోని సరళాదేవి ప్రభుత్వ కళాశాల ఎదుట గురువారం ముస్లీం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హిజాబ్కు అనుకూలంగా ధర్నా చేశారు. పెద్ద ఎత్తున ముస్లింలు
బళ్లారి(కర్ణాటక): బళ్లారిలో హిజాబ్ సెగలు మరోరోజు చెలరేగాయి. నగరంలోని సరళాదేవి ప్రభుత్వ కళాశాల ఎదుట గురువారం ముస్లీం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హిజాబ్కు అనుకూలంగా ధర్నా చేశారు. పెద్ద ఎత్తున ముస్లింలు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. హిజాబ్తో వచ్చే విద్యార్థులను కళాశాలలోకి విద్యార్థులను అనుమతించాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు కళాశాల ఎదుట రోడ్డుపై నిరసన చేశారు. కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. అడిషన్ ఎస్పీ గురుపాల్ ముత్తూర్ చాలా చాక్యచక్యంగా వ్యవహించి నిరసన ఉద్రిక్తపరిస్థితిని శాంతిప చేశారు. కళాశాలలో మెత్తం 5,447 మంది విద్యార్థులు ఉన్నారు, వీరిలో 395 మంది ముస్లీం విద్యార్థులున్నారు. కళాశాల మార్గింగ్, ఈవినింగ్ షిప్టింగ్లో నడుస్తోంది. ఉదయం 29 మంది విద్యార్థినులు మాత్రం కళాశాలకు రాకుండా హిజాబ్ దరించి వస్తున్నామని తెలిపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తె లిపారు. దీనితో హిజాబ్ పేరుతో కొందరు విద్యార్థులు కళాశాల ఎదుట నిరసనకు దిగారు. ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తీగా నిలిచిపోయాయి. పోలీస్ బలగాలు అక్కడికి చేరుకుని విద్యార్థులను నిలువరించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని పోలీసుల వారికి హితవు పలికారు. ఇంతలో కొందరు ముస్లీం న్యాయవాదులు వచ్చినిరసన వ్యక్తం చేస్తున్న వారికి పరిస్థితి చెప్పి శాంతింప జేశారు. న్యాయపోరాటం చేస్తామని తెలితెలపడంతో ఆందోళన సద్దుమణిగింది.