రేవంత్ రెడ్డిలో విషం తప్ప విషయం లేదు: బాల్క సుమన్
ABN , First Publish Date - 2022-02-27T20:27:28+05:30 IST
రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రేవంత్లో విషం తప్ప, విషయం లేదని, పిచ్చి ముదిరిందన్నారు. సీఎం కేసీఆర్పై మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. నైనీ బ్లాక్లో ఉన్న నిలువలు ఎన్ని?, సింగరేణి టర్నోవర్ ఎంత?, రూ. 50వేల కోట్ల కుంభకోణం జరిగిందనడానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారనే అనుమానం కలుగుతోందన్నారు. సీనియర్లను బయటకు పంపి కాంగ్రెస్ను బీజేపీకి అప్పగిస్తారేమోనని బాల్క సుమన్ అన్నారు.