పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టు ఉంటాడు జగ్గారెడ్డి: బాల్క సుమన్

ABN , First Publish Date - 2022-04-30T19:40:33+05:30 IST

బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేలను..

పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టు ఉంటాడు జగ్గారెడ్డి: బాల్క సుమన్

హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వ్యక్తి రాహుల్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టు ఉంటాడని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఉత్తరాది సంస్కృతిని తీసుకువస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకున్నారన్నారు. జబర్దస్త్లో కమెడియన్లా బండి సంజయ్ మారాడని ఎద్దేవా చేశారు. మేము తలచుకుంటే మీ కిషన్ రెడ్డి బయట తిరగలేడని హెచ్చరించారు. బీజేపీది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అని బాల్క సుమన్ విమర్శించారు.




Updated Date - 2022-04-30T19:40:33+05:30 IST