ఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-10-23T11:01:07+05:30 IST

చెన్నూరు-భీమారం జోడువాగుల వద్ద నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్‌ అర్బన్‌ ఏకోపార్కుకు సంబంధించి రిపోర్టును సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆదేశించారు

ఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 


చెన్నూరు, అక్టోబరు 22 :  చెన్నూరు-భీమారం జోడువాగుల వద్ద నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్‌ అర్బన్‌ ఏకోపార్కుకు సంబంధించి రిపోర్టును సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని మినిష్టర్‌ క్వార్టర్స్‌లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీపీఆర్‌కు సంబం ధించిన నివేదికలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. దీపావళి వరకు రిపోర్టు అందజేయాలని సంబంధిత ఏజెన్సీ అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-10-23T11:01:07+05:30 IST