చంద్రబాబుపై మంత్రి బాలినేని సెటైర్లు

ABN , First Publish Date - 2020-11-29T18:59:51+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు

చంద్రబాబుపై మంత్రి బాలినేని సెటైర్లు

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జూమ్ మీటింగులు పెట్టుకుంటూ కూర్చుంటే ప్రజలు హర్షించరు. చంద్రబాబు తుఫాను ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. ఒక ప్రతిపక్ష నేతగా నష్టపోయిన రైతులను పరామర్శించాలి. మరో రెండు తుఫాన్లు రాబోతున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏపీలో పర్యటిస్తే.. వచ్చే తుఫాన్లు ఆగిపోయి రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది.  దీనిపై చంద్రబాబు ఆలోచించాలి’ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.

Updated Date - 2020-11-29T18:59:51+05:30 IST