వారి మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదు: బాలినేని

ABN , First Publish Date - 2022-01-15T22:22:36+05:30 IST

సినిమా ఇబ్బందులు చెప్పడానికే సీఎంను చిరంజీవి కలిశారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

వారి మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదు: బాలినేని

అమరావతి: సినిమా ఇబ్బందులు చెప్పడానికే సీఎంను చిరంజీవి కలిశారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-15T22:22:36+05:30 IST