వంగవీటి రాధా తన తండ్రిని గుర్తుపెట్టుకోవాలి: బాలినేని

ABN , First Publish Date - 2021-12-29T22:12:32+05:30 IST

తన మీద రెక్కీ చేశారని వంగవీటి రాధా చెప్పారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాధాకు సీఎం జగన్ గన్‌మెన్లలను పంపితే వెనక్కి పంపారని చెప్పారు.

వంగవీటి రాధా తన తండ్రిని గుర్తుపెట్టుకోవాలి: బాలినేని

ప్రకాశం: తన మీద రెక్కీ చేశారని వంగవీటి రాధా చెప్పారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాధాకు సీఎం జగన్ గన్‌మెన్లలను పంపితే వెనక్కి పంపారని చెప్పారు. వంగవీటి రాధా విషయాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రిని చంపిన పార్టీలో వంగవీటి రాధా చేరడం చారిత్రాత్మక తప్పిదమన్నారు. వంగవీటి రాధా తన తండ్రిని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా... ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబుని వెనకేసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-12-29T22:12:32+05:30 IST