మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-28T00:30:41+05:30 IST

మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

ప్రకాశం: మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. తనను ఎవరు టార్గెట్‌ చేస్తున్నారో తెలుసని.. వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు.తనపై ఆరోపణలు చేస్తున్నవారితో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. పవన్ రిక్వెస్ట్ చేస్తేనే జనసేనవారిపై కేసులు ఉపసంహరించుకున్నానని తెలిపారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. 



Updated Date - 2022-06-28T00:30:41+05:30 IST