బాలినేనిని ప్రశ్నించిన.. కవిత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-27T08:03:27+05:30 IST

బాలినేనిని ప్రశ్నించిన.. కవిత ఆత్మహత్యాయత్నం

బాలినేనిని ప్రశ్నించిన.. కవిత ఆత్మహత్యాయత్నం

ఒంటిపై కిరోసిన్‌ పోసుకోగా అడ్డుకున్న స్థానికులు

తెలుగు మహిళా నేతల పరామర్శ

అండగా ఉంటామని భరోసా 


కొత్తపట్నం, ఒంగోలు సిటీ, జూన్‌ 26: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించి వేధింపులకు గురైన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది. అల్లూరుకు చెందిన వైసీపీ నాయకుడు, కవిత మామ అయిన బుచ్చిరెడ్డికి ఆమెకు మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘గడప గడపకు’ కార్యక్రమంలో ఇటీవల అల్లూరు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి బుచ్చిరెడ్డిపై కవిత ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. బుచ్చిరెడ్డి ‘నెల నుంచి నీరు, పాలు రాకుండా చేశాడు. పవర్‌ కట్‌ చేసి బెదిరించాడు. తాజాగా ఇంటి గేటుకు తాళం వేసి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు’ అని శనివారం కవిత వాపోయారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఇల్లు కోర్టు వివాదంలో ఉందని, తాము కూడా అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. కాగా.. కవితను పరామర్శించేందుకు ఆదివారం తెలుగు మహిళలు అల్లూరు గ్రామానికి వచ్చారు. ఈ ఘటనపై గ్రామంలో విచారించారు. కవిత, బుచ్చిరెడ్డి, అత్త, భర్తతో కూడా మాట్లాడారు. వారు వెళ్లిన తర్వాత కవిత, ఆమె అత్తమామల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, స్థానికులు కాపాడారు. కాగా జనసేన పార్టీ మహిళా విభాగం నాయకులు కూడా కవితతో మాట్లాడి, అండగా ఉంటామని చెప్పారు. 


Updated Date - 2022-06-27T08:03:27+05:30 IST