బాలయోగి గురుకుల స్కూల్లో ప్రవేశాలు
ABN , First Publish Date - 2021-06-23T04:43:10+05:30 IST
సర్పవరం జంక్షన్, జూన్ 22: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యాన జిల్లాలో నిర్వహిస్తున్న బాలయోగి గురుకుల స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో 2021-22 సంత్సరంలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పి. వెంకటాపురం కాలేజీ ప్రిన్సిపాల్ టి.గంగాభవాని కోరారు. కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురం బాలికల స్కూల్లో 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియెట్
సర్పవరం జంక్షన్, జూన్ 22: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ ఆధ్వర్యాన జిల్లాలో నిర్వహిస్తున్న బాలయోగి గురుకుల స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో 2021-22 సంత్సరంలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పి. వెంకటాపురం కాలేజీ ప్రిన్సిపాల్ టి.గంగాభవాని కోరారు. కాకినాడ రూరల్ మండలం పి.వెంకటాపురం బాలికల స్కూల్లో 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 40 సీట్లకు విద్యార్థుల నుంచి ఆన్లైన్, సమీపంలో ఉన్న గురుకుల స్కూల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 7 వరకు ఉందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం హెచ్టీటీపీ://ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎ్ఫఎ్సఎ్స.ఇన్/, ఇంటర్మీడియెట్లో ప్రవేశం కోసం హెచ్టీటీపీఎ్స://ఏపీజీపీసీఈటీ.ఏపీసీఎ్ఫఎ్సఎ్స.ఇన్/ఇంటర్ వెబ్సైట్లో మీసేవా ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు గురుకుల ఆశ్రమానికి వచ్చి సంప్రదించాలని ఆమె తెలిపారు.