పురుగులమందు తాగి యువకుడి బలవన్మరణం

ABN , First Publish Date - 2020-11-29T06:15:10+05:30 IST

పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం సిరికొండ మండలంలో చోటు చేసుకుంది.

పురుగులమందు తాగి యువకుడి బలవన్మరణం

సిరికొండ, నవంబరు 28: పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం సిరికొండ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలంలో తుమ్మలపాడ్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ శ్రీనివాస్‌(22) చాత్రోపాధ్యాయుడి శిక్ష (డీఎడ్‌) చేస్తున్నాడు. అయితే, లాక్‌డౌన్‌ నుంచి ఇంటి దగ్గరనే ఉంటున్నక్రమంలో శుక్రవారం శ్రీనివాస్‌ మద్యం తాగి రావడంతో తండ్రి వినాయక్‌రావ్‌ మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెంది రాత్రి వేళ చేనులో కి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు ఆదిలాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బాలాజీ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-11-29T06:15:10+05:30 IST