సీఎం జగన్‌తో ఆ విషయం చెప్పా: బాలనాగి‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-12T20:16:27+05:30 IST

మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి అన్నారు.

సీఎం జగన్‌తో ఆ విషయం చెప్పా: బాలనాగి‌రెడ్డి

కర్నూలు: మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి  అన్నారు. మంగళవారం వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో  ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను మంత్రిగా ఉంటే నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపలేను, ప్రజల సమస్యలను గుర్తించలేను. సీఎం జగన్ తో నేను ఒక్కటే చెప్పాను పులికనుమ, ఆర్డీఎన్,  ప్రాజెక్టు, 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడిగా. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కోరిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలని కోరా. నేను కోరిన వెంటనే జీఓ విడుదల చేశారు’’ అని ఎమ్మెల్యే బాలనాగి‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-12T20:16:27+05:30 IST