వెంటనే పూర్తి లాక్డౌన్ ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-07-05T21:13:29+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపధ్యంలో జీహెచ్ఎంసితో పాటు, ఇతర జిల్లాల్లో వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపధ్యంలో జీహెచ్ఎంసితో పాటు, ఇతర జిల్లాల్లో వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణలో శాసన సభ్యులు, మంత్రులు, చివరకు సచివాలయం, ప్రగతి భవన్ను సైతం కరోనా తాకింది. అలాగే ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం రోజుకు వెయ్యికి పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం, ముఖ్యమంత్రి ఫామ్హౌస్నుంచి ప్రభుత్వ పధకాలపైనే దృష్టిసారించడం విచారకరమని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో ఉన్న ప్రజల ఆరోగ్యం గురించి సముచిత నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ధైర్యం కల్పించక పోవడం శోచనీయమని అన్నారు. మంత్రి వర్గంతో వెంటనే సమావేశం జరిపి సంపూర్ణ లాక్డౌన్ విధించి కరోనాను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.