‘మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను రద్దు చేస్తున్నాం’

ABN , First Publish Date - 2021-05-17T19:42:15+05:30 IST

అమరావతి : కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలలో భాగంగా శాసన పరిషత్ అధ్యక్షుడు, శాసన సభాపతి ఆదేశాల మేరకు..

‘మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను రద్దు చేస్తున్నాం’

అమరావతి : కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలలో భాగంగా శాసన పరిషత్ అధ్యక్షుడు, శాసన సభాపతి ఆదేశాల మేరకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు ఏపీ శాసనమండలి కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వెల్లడించారు. ఈ మేరకు మే 20 నుంచి మీడియా పాయింట్ వద్ద ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ లాబీలలో పాత్రికేయుల ప్రవేశాన్ని కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్న సభ్యులకు 2020-2021లో జారీ చేసిన ఐడీ కార్డ్ చూపించి తాత్కాలిక ప్రెస్ గ్యాలరీలో పాస్ తీసుకోవాలన్నారు. అక్కడ కూడా భౌతికదూరం పాటించాలన్నారు. 


Updated Date - 2021-05-17T19:42:15+05:30 IST