అసెంబ్లీ కార్యదర్శిగా మళ్లీ బాలకృష్ణమాచార్యులు

ABN , First Publish Date - 2021-05-06T08:53:02+05:30 IST

శాసనసభ కార్యదర్శిగా పి.బాలకృష్ణమాచార్యులును మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వు జారీ చేశారు

అసెంబ్లీ కార్యదర్శిగా మళ్లీ బాలకృష్ణమాచార్యులు

మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు


అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): శాసనసభ కార్యదర్శిగా పి.బాలకృష్ణమాచార్యులును మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 2023 ఏప్రిల్‌ 30 వరకూ బాలకృష్ణమాచార్యులు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తారని బుధవారం నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి బాలకృష్ణమాచార్యులు 2020 ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు. ఆయన్ను గతేడాది మే 1నుంచి 2021 ఏప్రిల్‌ 30 వరకూ కార్యదర్శిగా ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ గడువూ ముగిసిపోవడంతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - 2021-05-06T08:53:02+05:30 IST