బాలకృష్ణ రూ.1.25కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-04T09:37:11+05:30 IST

బాలకృష్ణ రూ.1.25కోట్ల విరాళం

బాలకృష్ణ రూ.1.25కోట్ల విరాళం

తెలంగాణ, ఏపీలకు చెరి 50 లక్షలు.. సీసీసీకి రూ. 25 లక్షలు

కరోనా నియంత్రణ చర్యలకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రూ.1.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అందులో 50 లక్షలు ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌కు, మరో 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేరకు  చెక్కును ఆయన మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు చలనచిత్ర కార్మికుల సహాయం నిమిత్తం కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ)కి కూడా బాలకృష్ణ రూ.25 లక్షలు ఇచ్చారు. సీసీసీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు, నిర్మాత సి.కల్యాణ్‌కి చెక్‌ను అందజేశారు. దర్శకుడు సంపత్‌ నంది కూడా సీసీసీకి తనవంతుగా రూ.5 లక్షలు అందజేశారు. సీసీసీ కార్యక్రమాల గురించి దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సీసీసీ విరాళాల ద్వారా.. నిత్యావసర సరుకులన్నీ సిద్ధం చేసుకుని, పరిశ్రమలోని కార్మికుల ఇంటింటికీ వెళ్లి తామే అందజేస్తామన్నారు.

Updated Date - 2020-04-04T09:37:11+05:30 IST