Balakrishna: మీడియా పాయింట్ వద్ద బాలకృష్ణ ఇబ్బంది..

ABN , First Publish Date - 2022-10-05T15:42:32+05:30 IST

నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Balakrishna: మీడియా పాయింట్ వద్ద బాలకృష్ణ ఇబ్బంది..

విజయవాడ (Vijayawada): సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇంద్రకీలాద్రి కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు అమ్మ వారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని బాలకృష్ణకు అందించారు. 


అనంతరం బాలకృష్ణ మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. అక్కడ అధికారులు మైక్ ఏర్పాటు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్నా కూడా సమాచారశాఖ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మైక్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల అరుపులు, కేకల మధ్యలో తన మాట తనకే వినబడకపోవడంతో బాలయ్య మీడియాతో గట్టిగా ప్రసంగించారు.


శరన్నవరాత్రులలో భాగంగా ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నానని బాలకృష్ణ చెప్పారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులపై ఉండాలని, రాష్ట్రాభివృద్ది జరిగి,  ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. మానవ శాంతి ఉంటే ప్రపంచ కల్యాణం జరుగుతుందని, చెడు మీద మంచి, అధర్మము మీద ధర్మం గెలిచిన రోజు కాబట్టి ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తుందన్నారు. విజయదశమి రోజు కాబట్టి అన్ స్టాపబుల్ కోసం ఇక్కడికి వచ్చానని బాలకృష్ణ అన్నారు.

Updated Date - 2022-10-05T15:42:32+05:30 IST