దళితులపై దాడులు అమానుషం
ABN , First Publish Date - 2020-08-07T10:36:58+05:30 IST
రాష్ట్రంలో దళితులపై దాడులు అమానుషమని, వారికి రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర దళిత నాయకుడు ఎద్దు బాలకృష్ణ ..
వేపాడ/ఎల్.కోట, ఆగస్టు 6 : రాష్ట్రంలో దళితులపై దాడులు అమానుషమని, వారికి రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర దళిత నాయకుడు ఎద్దు బాలకృష్ణ అన్నారు. 29ఏళ్ల క్రితం చుండూరు మారణకాండలో అమరులైన దళిత వీరులకు జోహార్లర్పిస్తూ వేపాడ, ఎల్.కోటలో గురువారం నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకులాల అహంకారాన్ని, దళితులపై దాడులను ప్రశ్నించినందుకు ఆనాడు దాష్టీకంగా దళితులను ఊచకోత కోశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఏకమై అంబేడ్కర్ ఆశయసాధనకు కృషిచేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అమానుష ఘటనలపై పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రమంలో స్థానిక దళితసంఘం నాయకులు, ప్రజాసంఘం నాయకులు పాల్గొన్నారు.