తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బాలకవి సమ్మేళనం

ABN , First Publish Date - 2022-08-19T04:34:06+05:30 IST

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బాలకవి సమ్మేళనం

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బాలకవి సమ్మేళనం
బాలకవి సమ్మేళనంలో పాల్గొన్న వికారాబాద్‌ జిల్లా విద్యార్థులు

వికారాబాద్‌, ఆగస్టు 18: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన బాలకవుల సమ్మేళనంలో వికారాబాద్‌ జిల్లా బాలలు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు ఎంపికైన బాలకవులు(విద్యార్థులు) ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. కవిత్వాలు, పద్యాలు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా బాధ్యులు కుమ్మరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని పలువురు విద్యార్థుల్లో దాగి ఉన్న సాహిత్వ అభిరుచిని, తెలివితేటలను వెలికితీసేందుకు తెలంగాణ జాగృతి నిర్వహించిన బాలకవి సమ్మేళనం దోహదపడిందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొదించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలు దాటి విదేశాల్లో విస్తరింపచేస్తున్న తెలంగాణ జాగృతి సేవలు అమూల్యమైనవన్నారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ దత్తాత్రేయ, వివిధ పాఠశాలల బాలకవులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజు, అంజిలప్ప, ప్రశాత్‌ పాటిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:34:06+05:30 IST