కన్నుల పండువగా Balkampet ellamma కళ్యాణోత్సవం
ABN , First Publish Date - 2022-07-05T16:25:31+05:30 IST
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది.
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు కుటుంబ సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు.