బక్రీద్ స్పెషల్: రూ. 4.50 లక్షలు పలికిన జంట పొట్టేళ్లు

ABN , First Publish Date - 2021-07-21T14:44:34+05:30 IST

ఈద్-ఉల్- అజహా(బక్రీద్) సందర్భంగా...

బక్రీద్ స్పెషల్: రూ. 4.50 లక్షలు పలికిన జంట పొట్టేళ్లు

లక్నో: ఈద్-ఉల్- అజహా(బక్రీద్) సందర్భంగా కుర్బీనీ(బలిదానం) కోసం ముస్లిం సోదరులు పొట్టేళ్లను కొనుగోలు చేస్తుంటారు. యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో పొట్టేళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యూపీలోని లక్నో, బులంద్‌షహర్‌లలో అత్యంత ఖరీదైన పొట్టేళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. 


లక్నోలో పొట్టేళ్ల జంట 4 లక్షల 50 వేల రూపాయలకు విక్రయం కాగా, బులంద్ షహర్‌లో బలిష్టంగా ఉన్న ఒక్కో పొట్టేలును లక్షా 35 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. లక్నోలో విక్రయమైన జంట పొట్టేళ్లు డ్రై ఫ్రూట్స్, జ్యూస్‌లు తాగుతూ బలంగా పెరిగాయి. వీటి వయసు రెండున్నరేళ్లు. అత్యంత ఖరీదైన ఈ పొట్టేళ్ల జోడీని విక్రయించిన వ్యక్తి మాట్లాడుతూ ఈ పొట్టేళ్లకు ఆహారం అందించేందుకు రోజుకు రూ. 600 ఖర్చయ్యిందన్నారు. ఈ పొట్టేళ్లు బాదాం, కాజూ, పిస్తా మొదలైనవాటిని తినడంతోపాటు జ్యూస్ తాగుతాయన్నారు. అలాగే మిఠాయిలతో పాటు అన్నం కూడా తింటాయన్నారు. 

Updated Date - 2021-07-21T14:44:34+05:30 IST