బక్రీద్ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
ABN , First Publish Date - 2022-06-29T07:00:47+05:30 IST
త్యాగాలకు ప్రతీకైన బ క్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో, సామరస్యంగా నిర్వహించు కోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ప్రజలకు వి జ్ఞప్తి చేశారు.
కలెక్టర్ రాహుల్శర్మ
నల్లగొండ టౌన, జూన 28: త్యాగాలకు ప్రతీకైన బ క్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో, సామరస్యంగా నిర్వహించు కోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ప్రజలకు వి జ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ముస్లిం మతపెద్దలు, శాంతి సంఘం సభ్యులతో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల బక్రీద్ ఉన్నందున జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచిం చా రు. ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడుతూ బక్రీద్ పండుగకు పోలీస్ శాఖ తరుపు న బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీస్ కమిటీ చేసిన సూచనలను స్వీకరించారు. సమావేశంలో శాంతి సంఘం సభ్యులు హఫీజ్ఖాన, వీరెళ్లి చంద్రశేఖర్, నేతి రఘుపతి, సయ్యద్ హషం, రఫీ, రజీయొద్దీన, అహ్మద్కలీం, నెల్లికంటి సత్యం, మత పెద్దలు అబ్దుల్ బషీర్, మునిసిపల్ కోఆప్షన మెంబర్ జమాల్ఖాద్రి, ఆర్డీవో రోహితసింగ్, మునిసిపల్ కమిషనర్ కెవి. రమణాచారి తదితరులు పాల్గొన్నారు.