బక్కారెడ్డి ఆశయ సాధనకు పోరాడాలి

ABN , First Publish Date - 2022-05-19T06:30:06+05:30 IST

సీపీఐ నాయకుడు కొణతం బక్కారెడ్డి ఆశయ సాధనకు ప్రజలు పోరాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బక్కారెడ్డి ఆశయ సాధనకు పోరాడాలి
బస్కారెడ్డి స్మారకస్తూపం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

మోత్కూరు, మే 18: సీపీఐ నాయకుడు కొణతం బక్కారెడ్డి ఆశయ సాధనకు ప్రజలు పోరాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బక్కారెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు ఆయన స్మారక స్థూపం వద్ద ఎర్రజెండా ఎగురవేసి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ బక్కారెడ్డి సీపీఐ నాయకుడిగా బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారన్నారు. అడ్డగూడూరు భూ పోరాటంలో పాల్గొని కేసులు పెట్టినా భయపడకుండా రైతుల పక్షాన నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అన్నెపు వెంకట్‌, పుల్కరం మల్లేష్‌, నాయకులు గొలుసుల యాదగిరి, పోచం కన్నయ్య, పెండెం వెంకటేశ్వర్లు, చాపల అంజ య్య, నర్సయ్య, తాడూరు లక్ష్మీనర్సయ్య, వీరస్వామి, కొమురయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:30:06+05:30 IST