Olympics: భజరంగ్ పునియా విజయం.. నిరాశపర్చిన సీమా
ABN , First Publish Date - 2021-08-06T15:09:55+05:30 IST
ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా తొలి విజయం నమోదు చేశాడు.
టోక్యో: ఒలింపిక్స్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా తొలి విజయం నమోదు చేశాడు. పురుషుల 65కిలోల విభాగంలో ప్రిక్వార్టర్స్లో కజిక్స్తాన్ రెజ్లర్ అక్మత్ అలీని 3-3 తేడాతో ఓడించాడు. చివరికి ఇద్దరి స్కోరు 3-3తో సమం కాగా, ఒక దఫాలో భజరంగ్ ఒకేసారి రెండు పాయింట్లు సాధించడంతో విజేతగా నిలిచాడు. దీంతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో భజరంగ్ ఇరాన్కు చెందిన గియాసి చెకా మొర్తజాతో తలపడతాడు. మరికొద్దిసేపట్లోనే ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు ఈసారి భారత మహిళా రెజ్లర్లు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అదే పునరావృతమైంది. శుక్రవారం జరిగిన మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సీమా బిస్లా పరాజయం పాలైంది. ట్యునీషియా రెజ్లర్ హమ్దీ సర్రా చేతిలో 3-1 తేడాతో ఓటమిచవిచూసింది.