మిసెస్‌ ఇండియా తెలంగాణగా బైశాలి పాండా

ABN , First Publish Date - 2022-01-19T15:45:58+05:30 IST

మిసెస్‌ ఇండియా తెలంగాణ-2021 టైటిల్‌ విన్నర్‌గా నగరానికి చెందిన బైశాలి పాండా నిలిచారు.

మిసెస్‌ ఇండియా తెలంగాణగా బైశాలి పాండా

బంజారాహిల్స్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మిసెస్‌ ఇండియా తెలంగాణ-2021 టైటిల్‌ విన్నర్‌గా నగరానికి చెందిన బైశాలి పాండా నిలిచారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ పేరిట 40-60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు విశాఖపట్నంలో పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. బైశాలి పాండా టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. టైటిల్‌ గెలవడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు. 

Updated Date - 2022-01-19T15:45:58+05:30 IST