జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్

ABN , First Publish Date - 2020-08-05T20:31:38+05:30 IST

తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్

అనంతపురం: తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడప జిల్లాకు తరలించారు.

Updated Date - 2020-08-05T20:31:38+05:30 IST