కాశీబుగ్గ సీఐకి బెయిల్‌ మంజూరు

ABN , First Publish Date - 2020-08-12T10:30:18+05:30 IST

దళిత యువకుడిని బూటు కాలితో తన్నిన కేసులో కాశీబుగ్గ సీఐ ఆర్‌.వేణుగోపాల్‌కు మంగళవారం బెయిల్‌ మంజూరైంది.

కాశీబుగ్గ సీఐకి బెయిల్‌ మంజూరు

 గుజరాతీపేట, ఆగష్టు 11: దళిత యువకుడిని బూటు కాలితో తన్నిన కేసులో కాశీబుగ్గ సీఐ ఆర్‌.వేణుగోపాల్‌కు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. పలాస మండలం టెక్కలిపట్నంకు చెందిన ఓ దళిత యువకుడిపై దాడి చేసి బూటు కాలితో తన్నిన సీఐ వేణుగోపాల్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీఐపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.  ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానం నాయమూర్తి సీఐకు బెయిల్‌ మంజూరు చేశారు.  

Updated Date - 2020-08-12T10:30:18+05:30 IST