వరవరరావుకు బెయిల్ పొడిగింపు
ABN , First Publish Date - 2021-10-27T02:55:57+05:30 IST
విరసం నేత వరవరరావుకు బెయిల్ను పొడిగిస్తూ బాంబే
హైదరాబాద్: విరసం నేత వరవరరావుకు బెయిల్ను పొడిగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 18 వరకు బెయిల్ను బాంబై హైకోర్టు పొడిగించింది. వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్కు తరలించే అంశంపై పిటిషన్ దాఖలు చేయాలని బాంబే హైకోర్టు సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్య పరిస్థితి బానే ఉందని ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు బాంబే హైకోర్టు వాయిదా వేసింది.