బహదూర్పేటకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-05-25T06:19:55+05:30 IST
ఆలేరు మునిసిపాలిటీలో విలీనం చేసిన బహదూర్ పేట గ్రామానికి త్రీఫేజ్తో కూడిన 24గంటల విద్యుత్ను సరఫరా చేయాలని బీజేపీ ఆలేరు పట్టణ కమిటీ అధ్యక్షుడు జహంగీర్, ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్ కోరారు.
బీజేపీ ఆలేరు పట్టణ కమిటీ అధ్యక్షుడు జహంగీర్, ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్
ఆలేరు, మే 24:ఆలేరు మునిసిపాలిటీలో విలీనం చేసిన బహదూర్ పేట గ్రామానికి త్రీఫేజ్తో కూడిన 24గంటల విద్యుత్ను సరఫరా చేయాలని బీజేపీ ఆలేరు పట్టణ కమిటీ అధ్యక్షుడు జహంగీర్, ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్ కోరారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చూస్తూ బీజేపీ నాయకులు మంగళవారం మండల కేంద్రంలోని ట్రాన్స్కో ఏఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రీఫేజ్ విద్యుత్ సరాఫరా లేనందున గ్రామంలో సమస్యలు ఎదురవు తున్నాయన్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందికి దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదన్నారు. మోట కొండూరు మండలం ఇక్కుర్తిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా ప్రస్తుతం బాహదూర్ పేట, మంతపురి, దిలావర్పూర్, కమ్మగూడెం, పిట్టలగూడెం గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆలేరు మునిసి పాలిటీ నుంచి బాహదూర్పేటకు త్రీఫేజ్తో కూడిన 24గంటల విద్యుత్ను సరాఫరా చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చూస్తూ ట్రాన్స్కో ఏఈ బిక్షపతికి వినతిపత్రం అందజేశారు. ముందుగా బాహదూర్పేట నుంచి ట్రాన్స్కో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ పట్ఠణ కమిటీ అధ్యక్షుడు బడుగు జహంగీర్, ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేశ్, నాయకులు జంపాల దశరథ, ఎం.నర్సింహరెడ్డి, తోట మల్లయ్య, వెంకటయ్య, సందెల సుభాష్, కామికారి కృష్ణ, పత్తి రాములు, వట్టిపల్లి సిద్ధిమల్లయ్య, మౌళి మల్లయ్య, పొట్టిపల్లి రాములు, శేఖర్, నరేష్, కె.కుమార్, కె.శ్రీనివాస్, వస్పరి రమేశ్, రాయపురం శ్రీనివాస్, రాములు, వెంకటేశ్, కుండె బీరయ్య పాల్గొన్నారు.