బడుగులందరూ ఈటల రాజేందర్‌ వెంటే

ABN , First Publish Date - 2021-05-13T07:33:13+05:30 IST

రాజకీయంగా అన్యాయానికి గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెంటే తెలంగాణ బడుగులు ఉంటారని తెలంగాణ ముదిరాజు యువసేన నాయకులు అన్నారు.

బడుగులందరూ ఈటల రాజేందర్‌ వెంటే
ఈటల రాజేందర్‌తో జిల్లా బీసీ సంఘం నాయకులు

 భువనగిరి టౌన, మే 12: రాజకీయంగా అన్యాయానికి గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెంటే తెలంగాణ బడుగులు ఉంటారని  తెలంగాణ ముదిరాజు యువసేన నాయకులు అన్నారు. బుధవారం హైదరాబా ద్‌లో యువసేన నాయ కులు ఈటల రాజేందర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌ చేసే పోరాటా లకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.  మాజీ మంత్రిని కలిసిన వారిలో యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదు రామకృష్ణ, కార్యదర్శి దోటి లింగస్వామి  ఉన్నారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా భువనగిరిలో నిరసనలు కొనసాగుతున్నాయి. 5వ రోజు బుధవారం జరిగిన నిరసనలో బీసీ హక్కుల పోరా ట  సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల అశోక్‌, ముదిరాజు సంఘం నాయకులు కె.సోమయ్య, బండారు నారాయణ, ఉడుత భాస్కర్‌, పులి వెంకటేష్‌, సాదు విజయ, సామల ఆనంద్‌, మాటూరి అఖిల్‌కిరణ్‌, యాట నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T07:33:13+05:30 IST