కాంగ్రెస్‌ హయాంలోనే బడుగుల అభ్యున్నతి

ABN , First Publish Date - 2021-10-25T04:05:40+05:30 IST

బడుగుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ హయాం లోనే కృషి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే బడుగుల అభ్యున్నతి
ముత్యంపేటలో మైనార్టీ యువతకు కాంగ్రెస్‌ పార్టీ కండువా వేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు

- మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
దండేపల్లి, అక్టోబరు 24: బడుగుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ హయాం లోనే  కృషి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మండలంలోని కన్నెపల్లి, ముత్యంపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన యువత, నాయకులు పీఎస్‌ఆర్‌ సమక్ష్యంలో ఆదివారం  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరందరి కి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా పీఎస్‌ఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. ఇతర పార్టీలకు చెందన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నరన్నారు. రాబోయ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకొచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కన్నెపల్లిలో చుంచు నగేష్‌ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు సుమారు 150 మంది, ముత్యంపేట నుంచి హోలీ హైదర్‌ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మైనార్టీ నాయకులు, యువత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గడ్డం నాగరాణి-త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వనపర్తి రవి, సర్పంచులు శంకరయ్య, శ్రీనివాస్‌, ఎంపీటీసీలు ము త్యాల శ్రీనివాస్‌, బొడ్డు కమలాకర్‌, తోట మోహన్‌, యూత్‌ మండల అధ్యక్షులు దుర్గప్రసాద్‌, నాయకులు కాంతరావు, సురేందర్‌, గణపతి, తిరుపతి, కిషన్‌, వెంకటేష్‌, సత్యం, రాజయ్య, ధర్మయ్య, చెన్నయ్య, పోచం, రమణ, రమేష్‌, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:05:40+05:30 IST