ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం
ABN , First Publish Date - 2022-05-27T06:18:04+05:30 IST
వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్ అధ్యక్షుడు అలా తారక రామారావు అన్నారు.
ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం
పాయకాపురం, మే 26 : వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మో పడం తప్ప అభివృద్ధి శూన్యమని 58వ డివిజన్ అధ్యక్షుడు అలా తారక రామారావు అన్నారు. 58వ డివిజన్లో గురువారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గుంజ గురుమూర్తి, కంచర్ల రంగనాఽథ్, మునగాల చిన రంగా, వీరయ్య చౌదరి, కర్రి వెంకటేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.