సింధు, శ్రీకాంత్‌, ప్రణీత్‌ ముందంజ

ABN , First Publish Date - 2021-11-25T08:01:13+05:30 IST

భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు.

సింధు, శ్రీకాంత్‌, ప్రణీత్‌ ముందంజ

ఇండోనేసియా ఓపెన్‌


బాలి: భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 17-21, 21-17, 21-17తో అయా ఒహొరి (జపాన్‌)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-15, 19-21, 21-12తో సహచరుడు ప్రణయ్‌పై, సాయి ప్రణీత్‌ 21-19, 21-18తో టోమా పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి రెండోరౌండ్‌ చేరారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని జోడీ 27-29, 18-21తో గాబ్రియెలా-స్టెఫానీ (బల్గేరియా) జంట చేతిలో, మిక్స్‌డ్‌లో సిక్కి-ధ్రువ్‌ ద్వయం 7-21, 12-21తో జపాన్‌ జోడీ క్యోహి-షినోయా చేతిలో, అశ్విని-సుమిత్‌ జంట 24-22, 12-21, 19-21తో జపాన్‌ ద్వయం తకురో-మత్సుయామ చేతిలో ఓటమిపాలయ్యారు.  

Updated Date - 2021-11-25T08:01:13+05:30 IST