కేన్సర్ బాధిత చిన్నారులకు పీవీ సింధూ చేయూత
ABN , First Publish Date - 2022-04-20T14:04:24+05:30 IST
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కేన్సర్ బాధిత చిన్నారుల పట్ల ఉదారతను చాటారు. రూ. లక్ష విరాళం అందించారు
హైదరాబాద్ సిటీ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కేన్సర్ బాధిత చిన్నారుల పట్ల ఉదారతను చాటారు. రూ. లక్ష విరాళం అందించారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ) నిర్వహించనున్న వైటథాన్ రన్ టీ - షర్ట్ను ఆమె మంగళవారం ఆస్పత్రిలో ఆవిష్కరించారు. మూడేళ్లలోపు పిల్లలను కంటి కేన్సర్ నుంచి కాపాడటం ఉదాత్తమైన కార్యక్రమన్నారు. ఎల్వీపీఈఐ వ్యవస్థాపకుడు, ట్రస్టీ బోర్డు చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడుతూ చిన్నారుల కంటి సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడానికి ఐసైట్ యూనివర్సల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఐ కేన్సర్ ద్వారా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కంటి కేన్సర్తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు అవసరమైన నిధులను సేకరించడానికి వైట్థాన్ రన్ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 8న నెక్లె్సరోడ్డు పీపుల్స్ ప్లాజాలో జరగనున్న రన్లో పాల్గొనదల్చిన వారు"https://www.ifinish.in/event_details /_Whitathon_' లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.