బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు దూకుడు.. పతకం ఖాయం చేసుకున్న తెలుగుతేజం

ABN , First Publish Date - 2022-04-29T22:43:58+05:30 IST

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2022లో అదరగొడుతున్న భారత బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు దూకుడు.. పతకం ఖాయం చేసుకున్న తెలుగుతేజం

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2022లో అదరగొడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పతకం ఖాయం చేసుకుంది. నేడు చైనాకు చెందిన హే బింగ్జియావోతో జరిగిన క్వార్ట్‌ఫైనల్ పోరులో 21-9, 13-21, 21-19తో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఫలితంగా కనీసం కాంస్య పతకం ఆమె ఖాతాలో చేరినట్టే.


25 ఏళ్ల బింగ్జియావోపై సింధుకు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 2021న జరిగిన మ్యాచ్‌లో చైనా షట్లర్‌పై 21-13, 21-15తో వరుస సెట్లలో సింధు విజయం సాధించింది. తాజాగా మరోమారు ఆమెపై విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు సెమీస్‌కు చేరడం 2014 తర్వాత ఇది తొలిసారి.  

Updated Date - 2022-04-29T22:43:58+05:30 IST