బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-08-17T06:06:15+05:30 IST

కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వేములవాడకు తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు.

బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బోనాలతో బారులుదీరిన భక్తులు

 వేములవాడ, ఆగస్టు 16 : కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వేములవాడకు తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. తెల్లవారుజామునే నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బద్దిపోచమ్మ అమ్మవారికి సమర్పించారు.  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ ప్రకారం భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు.   భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు  ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-08-17T06:06:15+05:30 IST